సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్తున్న ఎనిమిది రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తేదీల వారీగా రద్దు చేసిన రైళ్ల వివరాలను ఎస్సీఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
హైదరాబాద్-మధరై, నాందేడ్-విశాఖపట్నం స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
అదనపు ప్రయాణికుల నేపథ్యంలో హైదరాబాద్-మధురై-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పరిధిలో రెండు వేసవి ప్రత్యేక రైళ్లు, నాందేడ్-విశాఖపట్నం స్టేషన్ల మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేసవికాలం నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ రెండు రైళ్ల రాకపోకలు ఈ నెల 20, 22 తేదీల్లో కొనసాగుతాయని తెలిపారు.
నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు రీషెడ్యూల్
నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్ ప్రత్యేక రైలు సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరాల్సిన రైలు 80 నిమిషాలు ఆలస్యంతో 06.15 గంటలకు నడుపుతున్నట్లు బుధవారం ఎస్సీఆర్ జోన్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీలలో రీషెడ్యూల్ చేశామన్నారు.