షాబాద్, డిసెంబర్ 5: భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో రైతు వేదికల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…భూమిలో చౌడును అరికట్టి నేల ఉత్పాదకతను పెంచాలని చెప్పారు.
నేల ఉత్పాదకతను పెంచేందుకు భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూలాధారం మట్టి కాబట్టి, దానిని మనందరం జాగ్రత్తగా కాపాడుకుని భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, చేవెళ్ల వ్యవసాయశాఖ ఏడీఏ రమాదేవి, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్లు గూడూర్ నర్సింగ్రావు, మిట్ట వెంకటరంగారెడ్డి, ఏవోలు వెంకటేశం, రాగమ్మ, తులసి, సురేశ్బాబు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్లు భానూరి మధుసూదన్రెడ్డి, రాంరెడ్డి, సర్పంచ్లు భానూరి మమత, సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, అనితా, మాణిక్యరెడ్డి, ఎంపీటీసీ కరుణాకర్, ఏఈవోలు రాజేశ్వరి, రాఘవేందర్, లిఖిత, సోనిశ్రీ, గీత, కిరణ్మయి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూసార పరీక్షలు తప్పనిసరి..
ఇబ్రహీంపట్నంరూరల్ : రైతులు వ్యవసాయ పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రపంచ మృత్తిక(నేల) దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని రైతువేదికల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పరిగూడలో ఏడీఏ సత్యనారాయణ, ముకునూరు రైతువేదికలో ఏఈవో శ్రవణ్, హయత్నగర్ ఏవో సల్మాన్రాజ్ పాల్గొని రైతులకు భూసార పరీక్షల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ముకునూరు సర్పంచ్ శివరాల జ్యోతి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, ఖాల్సా కోఆర్డినేటర్ బూడిద నర్సింహారెడ్డి, చర్లపటేల్గూడ ఎంపీటీసీ ఆంజనేయులు, సహకార సంఘం చైర్మన్ మహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ శంకర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు క్యాతి మోహన్రెడ్డి, హైమావతి, ఉద్యానవన అధికారి కనకలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులతోనే నేలకు ఆరోగ్యం
కొత్తూరు : సేంద్రియ ఎరువులు వాడితేనే నేల ఆరోగ్యంగా ఉంటుందని కొత్తూరు ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. తిమ్మాపూర్, ఇన్ముల్నర్వ రైతు వేదికల్లో ప్రపంచ నేలల దినోత్సవాని నిర్వహించారు. మట్టి నమూనాలను ఏవిధంగా సేకరించాలి, మట్టి పరీక్షలు ఏ విధంగా చేయించుకోవాలి తదితర విషయాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబింధు, డా. శైలజ, డా. రమేశ్, సర్పంచ్లు సత్తయ్య, అజయ్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, ఏఈవో అనిత, డా. అరుణ, డా. శకుంతల పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీఉమ హాజరై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బలదేవరెడ్డి, వెంకటేశ్, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, లక్ష్మణ్, కల్యాణి ఉన్నారు.
యాచారం : మనిషికి రక్త పరీక్ష ఎంత అవసరమో నేలకు మట్టి నమూనా పరీక్ష అంతే అవసరమని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ నేల స్వభావం, ఎరువుల యాజమాన్యం, మట్టి పరీక్ష నమూనా వాటి ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏఈవో గురుప్రసాద్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంరక్షణ బాధ్యత అందరిది
నందిగామ : నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ, మామిడిపల్లి రైతు వేదికలలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి, చంద్రారెడ్డి, కవిత, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
భూసారానికి అనుగుణంగా సాగు చేయాలి
కేశంపేట : మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ విశాల, సర్పంచ్లు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
మంచాల : బోడకొండ, ఆరుట్ల, మంచాల రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ నర్మద, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడడం వల్ల రాబోయే 50 ఏండ్లలోగా భూముల్లో పంటలు పండించడానికి నేల స్వభావం మారిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, సర్పంచ్లు కొంగరవిష్ణు వర్ధన్రెడ్డి, జగన్రెడ్డి, అలివేలు, పాండు, రైతు బంధు కోఆర్డినేటర్ చిందం రఘుపతి, ఏఈవోలు లింగస్వామి, సరిత, సాయిసిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు :సమతుల్యమైన ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి అన్నారు. మండలంలోని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పశు వైద్యాధికారి విజయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏఈవోలు సాయిరాం, రాణి, నిఖిత పాల్గొన్నారు.