సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : బయట షరీఫ్ శంకరయ్యలుగా బిల్డప్ ఇస్తూ.. తమను ఎవ్వరూ చూడడం లేదని రద్దీ ప్రాంతాల్లో మహిళలతో వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఇటువంటి పోకిరీలపై నజర్ వేసి వారి చేష్టలను వీడియో తీస్తున్నారు. సదరు పొకిరీలను పట్టుకొని తమ కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్కు రావాలని సూచిస్తున్నారు. దీంతో మరుసటి రోజు భార్యతో కలిసి రాగా.. వారి చేష్టలను వీడియోలో చూసిన భార్య అతడి భరతం పడుతున్నది.
ఇలా షీ టీమ్స్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న వారి చేష్టలను చూసి చాలా మంది కుటుంబ సభ్యులు నిశ్చేష్టులవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు, పెద్దవాైళ్లెతే భార్యలకు తమ నిజ స్వరూపం తెలిసిపోతుండడంతో చేసేది లేక మన్నించాలంటూ వేడుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. వారు చేసిన తప్పులను బట్టి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. పైండ్లెన వారైతే వారి భార్యలను కౌన్సెలింగ్కు పిలిపిస్తున్నారు. తన భర్త మంచివాడని, ఎలాంటి తప్పు చేయడంటూ షీ టీమ్స్ ముందు వాదిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్ చేసే వారు ఒక్కసారి ఈ వీడియో చూడండంటూ వారి భార్యలకు చూపిస్తున్నారు. దీంతో భార్య శివంగిలా మారి, భర్త చెంపలు చెళ్లుమనిస్తున్నది. పెండ్లి కాని యువత, మైనర్ పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులను పిలిచి వీడియోలు చూపిస్తున్నారు.
చాలా మంది మారుతున్నారు..
– నగర మహిళా భద్రత డీసీపీ, కవిత
షీ టీమ్స్కు పట్టుబడుతున్న వారు కౌన్సెలింగ్తో మారుతున్నారు. అయితే పట్టుబడుతున్న వారు ఇంట్లో చాలా సిన్సియర్గా ఉంటున్నట్లు తల్లిదండ్రులు, భార్యల వద్ద నటిస్తుంటారు. బయటకు వచ్చిన తరువాత వారి పోకిరీ చేష్టలు చేస్తుంటారు. అలాంటి వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారి మైండ్సెట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. చాలా మంది మారుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి చేష్టలను చూసి ఆ విషయాలను కొందరు తీవ్రంగా తీసుకునే ఘటనలు జరుగుతుంటాయి.