శంకర్పల్లి : బంగారు భవిష్యత్తు గల విద్యార్థులకు విధి వైపరీత్యం వల్ల దివ్యాంగులైతే వారిని ఆదుకొని ప్రోత్సహించాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్కుమార్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలం, రావులపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని మల్లీశ్వరికి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్పల్లికి చెందిన దాత మాణిక్యప్రభు సహకారంతో రూ. 5వేల నగదును ఆమె స్వగృహంలో ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్కుమార్ అందించారు.
ఈ సందర్భంగా నరేష్కుమార్ మాట్లాడుతూ మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున అంతలోపు మల్లీశ్వరికి కృత్రిమ కాలును అమర్చేందుకు మనసున్న దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేణేంద్రచారి, సత్యనారాయణగౌడ్, కిష్టయ్య పాల్గొన్నారు.