షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని శ్రీవాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో నానాటికి పర్యాటక రంగం ప్రగతి సాధిస్తూ వస్తుందని, మన ప్రాంతంలోని పేరుగాంచిన దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలను, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే జలపాతలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు హరితహారాన్ని విజయంతం చేయాలని, అనువైన ప్రతి చోట మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగానే దేవాలయం ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రమేశ్, సరాపు అనంతలక్ష్మీ, సుర్యనారాయణ, ప్రకాష్, పాండురంగయ్య, శ్రీనివాస్ గుప్తా, బాదం మాధవి, రజిత, మాణిక్యం, జగదీశ్వర్ నాయకులు పాల్గొన్నారు.