షాద్నగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కళ్లలో ఆనందం చూడలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీలో ఆయన పాల్గొని చీరలు పంపిణీ చేశారు. దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ దసర పండుగకు బతుకమ్మ కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను అందించడం సంతోషకరమన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల కళలు ఒక్కోక్కటి నెరవేరుతున్నాయని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అదే విధంగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ రవీందర్యాదవ్లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతియేట దసరా పండుగకు ఉచితంగా చీరలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కమిషనర్ లావణ్య, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.