షాద్నగర్ : నివాసాల నుంచి వచ్చె మురుగు నీళ్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ మురుగు కాలువల నిర్మాణాలు ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు సూచించారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీ మురుగునీళ్ల మళ్లింపులో భాగంగా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో నిర్మించే మురుగు కాలువ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మురుగు నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడొద్దని, అందుకు అనువుగా మురుగ కాలువ నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు.
త్వరలోనే షాద్నగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చె ప్రధాన మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, లింగారెడ్డిగూడ ఎంపీటీసీ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.