కేశంపేట, నవంబర్ 1 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని చౌలపల్లి, బొదునంపల్లి, లేమామిడి, నిర్దవెళ్లి, తొమ్మిదిరేకుల, లింగంధన గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మించామన్నారు. వందల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామాన్ని, పట్టణాలను ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
ఎన్నికలు రావడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కళమ్మ, శ్రీశైలంగౌడ్, పార్వతమ్మ, సావిత్రి బాల్రాజ్గౌడ్, వెంకట్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మమ్మ, యాదయ్య, మల్లేష్యాదవ్, మండల కోప్షన్ మెంబర్ జమాల్ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, నారాయణరెడ్డి, పల్లె నర్సింగ్రావు పాల్గొన్నారు.
నందిగామ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ కు మద్దతుగా గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి, వెంకమ్మగూడలో సర్పంచ్ రజనీత, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, చేగూరులో పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, నర్సప్పగూడలో సర్పంచ్ గోవిందు అశోక్, బండోనిగూడలో సర్పంచ్ జట్ట కుమార్లు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.
షాద్నగర్టౌన్ : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు శ్రీరామరక్షని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డులకు సంబంధించిన కాలనీల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలో జరిగిన అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
అదేవిధంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంతో వార్డులు గులాబీమయంగా మారాయి. మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సర్వర్పాషా, జీ.టీ శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు యుగేందర్, జూపల్లి శంకర్, సలీం, సుధాకర్, శ్రీహరి, నందకిశోర్, చెన్నయ్య, భిక్షపతి, రఘునాథ్యాదవ్, శివ, శేఖర్, శ్రీనివాస్, ఎజాజ్, ఫరీద్, కుమార్, శ్రీను పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : అల్లవాడ, జాలా గూడ గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు జోరుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, మ్యానిఫెస్టోలోని పథకాలు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు.
చేవెళ్ల మరింత అభివృద్ధి సాధించాలంటే ఎమ్మెల్యే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భీంరెడ్డి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్లు శేరి స్వర్ణలతాదర్శన్, వెంకటేశం గుప్తా, విజయలక్ష్మి, భీమయ్య, లావణ్య, జహంగీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకర్పల్లి : చేవెళ్ల గడ్డ పై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగటూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రఘునందన్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్, నవంబర్ 1 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పాతరోజులే వస్తాయని, ఆపార్టీ ప్రజలకు ఇస్తున్న హామీలను కర్ణాటక రాష్ట్రంలో మొదటగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండలంలోని గుండాల, లక్ష్మీగూడ, సాయిరెడ్డి గూడ గ్రామాల్లో సర్పంచ్ పోలీస్ ప్రణతి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని, ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. ప్రజలు ఏ ప్రభుత్వం మంచి చేసింది.. చేస్తుందో ఆలోచన చేసి ఓటు వేయాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీసీసెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి పాల్గొన్నారు.