షాద్నగర్రూరల్ : మాన సేవయే మాధవ సేవగా భావించి ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసి అదనపు వార్డును జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మంగళవారం బూర్గుల గ్రామ మాజీ సర్పంచ్ బూర్గుల సుమనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో రూ. 25లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వార్డును ఏర్పాటు చేశారన్నారు. వార్డు నిర్మాణానికి అంతర్జాతీయ లయన్స్క్లబ్, షాద్నగర్ లయన్స్క్లబ్ తోడ్పాటును అందించడం సంతోషకరమన్నారు. వార్డు ఏర్పాటుకు సహకరించిన డాక్టరు శ్రీకాంత్, గ్రామానికి చెందిన అజయ్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అదనపు వార్డును ఏర్పాటు చేయడంపై బూర్గుల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ, వైస్ ఎంపీపీ మౌనిక, డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు రమేశ్, కో-ఆప్షన్ సభ్యులు ఎల్లయ్య, ప్రహ్లాద్, వేణుప్రసాద్, బూర్గుల నర్సింగ్రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.