ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 28 : కాంగ్రెస్పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములుతో కలిసి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్కు మద్దతుగా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, తులేకలాన్ గ్రామాల్లో ఆదివారం ఇంటింటికీ ప్రచారాన్ని ఆలయంలో పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్పార్టీ రైతులకు రూ.15వేల రైతుబంధు, రెండులక్షల రుణమాఫీ, రూ.500 క్వింటాలుకు బోనస్, కౌలు రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు, ఉచిత కరెంటు హామీలిచ్చి కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాగానే మోసం చేసిందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గృహవిద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ హామీలను అటకెక్కించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దండుమైలారం గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేశ్, తులేకలాన్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి, యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవణమోని జంగయ్య ముదిరాజ్, నాయకులు రవిందర్రెడ్డి, బీరప్ప, రాజిరెడ్డి, జగదీశ్, కృష్ణారెడ్డి, పరకాశ్, భాష, రమేష్, అంజిబాబు, శ్రీశైలం, రవీందర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.