వికారాబాద్, ఏప్రిల్ 2: సమాజం కోసం పాటుపడిన మహనీయుల జీవితాలను ఆ దర్శంగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడతూ మహనీయులు ఎవరూ కూడా ఒక జాతి కో, కులానికో పరిమితం కాదని, సమాజం కోసం పాటు పడిన ప్రతి మహనీయుడు సమాజానికి చెందిన వారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్గౌడ్, సంఘం సభ్యులు సుధాకర్గౌడ్, వెంకటయ్యగౌడ్, హరిహర గౌడ్, ఆనంద్గౌడ్, ఎంపీపీ చంద్రకళ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కోఠాజీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల మండల కేంద్రంలో..
మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని నిర్వ హించారు. ఈ సందర్భంగా మండల గౌడ సంఘాల అధ్యక్షుడు మాలె కృష్ఱయ్యగౌడ్, ప్రధాన కార్య దర్శి తిర్మలాపూర్ రాములు మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన సేవలను వారు కొనియాడారు. త్వరలో మండల కేంద్రంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సం ఘాల నాయకులు శివకుమార్గౌడ్, వెంకటయ్యగౌడ్, రాఘవేందర్గౌడ్, రాచంద్ర య్యగౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.