సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్ ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కొత్త పోలీసు కమిషనర్ను ఎంపిక చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురు అదనపు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్యాను నగర పోలీస్ కమిషనర్గా ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 1993వ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సందీప్ శాండిల్య 2005 నుంచి 2007 వరకు సౌత్జోన్ డీసీపీగా, 2012 నుంచి 2014 వరకు హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్(క్రైమ్స్)గా బాధ్యలు నిర్వర్తించారు. 2016లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2018 నుంచి రైల్వే ఏడీజీగా పనిచేసి.. అక్కడి నుంచి పోలీస్ అకాడమీ డైరెక్టర్గా వెళ్లారు. తాజాగా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు.
భారీగా ఐపీఎస్ల బదిలీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ మరోసారి భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 10 మంది డీసీపీలు, జాయింట్ సీపీ, అదనపు సీపీలను బదిలీ చేసి, ఇతర జిల్లాల్లో కమిషనర్లు, ఎస్పీలుగా పోస్టింగ్లు కల్పించింది. వివరాలిలా ఉన్నాయి. రాచకొండ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న అంబర్ కిశోర్ ఝాను ఇక్కడి నుంచి బదిలీ చేసి, వరంగల్ కమిషనరేట్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న కల్మేశ్వర్ సింగన్వర్ను అక్కడి నుంచి బదిలీ చేసి, నిజామాబాద్ కమిషనర్గా, హైదరాబాద్ సౌత్- ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న చెన్నూరి రూపేశ్ను ఇక్కడి నుంచి బదిలీ చేసి, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 4వ బెటాలియన్ కమాండర్ సీహెచ్. సింధు శర్మను బదిలీ చేసి, కామారెడ్డి ఎస్పీగా, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1గా విధులు నిర్వర్తిస్తున్న హర్షవర్ధన్ను ఇక్కడి నుంచి బదిలీ చేసి, మహబూబ్నగర్ ఎస్పీగా, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న రితిరాజ్ను అక్కడి నుంచి బదిలీ చేసి, జోగులాంబ ఎస్పీగా, సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న యోగేశ్ గౌతమ్ను అక్కడి నుంచి బదిలీ చేసి, నారాయణపేట ఎస్పీగా పోస్టింగ్ కల్పించారు. కొత్త ప్రాంతాల్లో పోస్టింగ్లు పొందిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన పోస్టుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు.