తాండూరు రూరల్, జనవరి 11 : తాండూరు మండలం గౌతాపూర్లో బుధవారం సవరమ్మ జాతర ఘనంగా జరిగింది. మహిళలు బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజప్ప, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగప్ప, నియోజకర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశ్పాండే పాల్గొన్నారు.