ఆరుగాలం కష్టపడే అన్నదాత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గతంలో సాగు పనులు ప్రారంభం నుంచి పంట చేతికొచ్చేదాక పెట్టుబడులు తడిసిమోపెడై అన్నదాత అప్పుల సుడిగుండంలో చిక్కుకుని ఆగమయ్యేవాడు. రైతుల కష్టాన్ని గుర్తెరిగిన సీఎం కేసీఆర్ చేయూతనందించి గట్టెక్కించాలన్న సదుద్దేశంతో ప్రస్తుతం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఎకరాకు రూ.10 వేల సాయాన్ని అందజేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 11 విడుతల్లో రూ.3,337 కోట్ల రైతుబంధు సాయాన్ని అందజేసింది.
దీనికితోడు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు తదితర వాటిని ప్రభుత్వం ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రైతు ఏ కారణం చేత మృతి చెందినా ఆ కుటుంబానికి భరోసానిచ్చేలా రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతన్నకు మరింత చేయూతనందించాలని రైతుబంధు సాయాన్ని రూ.16వేల పెంచుతూ మ్యానిఫెస్టోలో చేర్చింది. అన్నివిధాలుగా ఆర్థిక సాయానికి తోడుగా సాగునీటి కోసం ప్రాజెక్టులు, చెక్డ్యాంల నిర్మాణం, ‘మిషన్ కాకతీయ’ చెరువులు, కుంటల పునరుద్ధరణతో నీటి నిల్వలు పెరిగి జిల్లాలో సాగు విస్తీర్ణమూ పెరిగింది. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది
రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : పంట పెట్టుబడుల కోసం రైతన్నలు ఇబ్బంది పడకుండా ‘రైతు బంధు’ పథకం భరోసా కల్పిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి యేటా లబ్ధిదారులు పెరుగుతూ వస్తున్న ప్పటికీ వెనుకడుగు వేయకుండా సాయం అందిస్తున్నారు. రైతు బంధువొచ్చాక.. రైతన్నలకు సాగు రందీ తీరింది. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా సాగుతున్న ది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటివరకు ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ వచ్చే ఐదేండ్లలో ఈ సాయాన్ని రూ.16వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందు పర్చారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి రైతాం గం జేజేలు పలుకుతున్నది.
రైతుల కష్టాలను గట్టేంచేందుకు..
రైతులు పంట పెట్టుబడి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు ముందుగానే రైతు బంధు సాయాన్ని అందిస్తున్న ది. సేటు దగ్గరకు పోయి చెయ్యి చాపే పరిస్థితులకు చరమ గీతం పాడిన ఈ రైతు బంధు పథకానికి ప్రతిరైతు కుటుం బం ఫిదా అవుతున్నది. తొలకరి జల్లులు కురిసింది మొద లు.. దుక్కి దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం రైతులకు పెట్టుబడి ఖర్చులు ప్రతి సీజన్కు తడిసి మోపెడవుతున్నాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగు బాట పట్టాల్సి వస్తున్నది. ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టి పెట్టుబడి సాయాన్ని అందిస్తు న్నారు.
రైతుల కష్టాలను దూరం చేసి వారి మొహాల్లో చిరునవ్వులు చిందింపజేస్తున్నారు. 2018 వానకాలం సాగు నుంచి ఏటా రూ.8వేల సాయం అందించగా.. 2019 వానకాలం సీజన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయాన్ని రూ.10వేలకు పెంచింది. కరోనా సంక్షోభ పరి స్థితుల్లోనూ పెట్టుబడి సాయాన్ని ఆపలేదు. రైతన్నలకు ఆత్మబంధువుగా నిలుస్తున్న రైతు బంధు పథకాన్ని రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి 11 విడుతలుగా రూ.3,337కోట్లను నిరాటంకంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఈ సాయాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఐదేండ్లలో గరిష్టంగా ఎకరాకు రూ.16వేలకు పెంచుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసు తో సాయం ఇచ్చి రైతులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుం డడంతో రైతు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి.
ఎన్నో ఆశలతో సాగుకు ఉపక్రమించే రైతులకు ప్రతి సీజన్ లోనూ పెట్టుబడి పెద్ద సమస్యగా ఉంటున్నది. అప్పులు చేసి పంటలను సాగు చేసినప్పటికీ పెట్టిన పెట్టుబడులు సైతం ఎల్లక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే రైతులు అప్పులు లేకుండా ప్రశాంతంగా పంటలను సాగు చేసేలా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి సీజన్లోనూ పెట్టు బడి సాయం అందిస్తున్నారు. గత ఆరేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుం టూ పంటలను పండించుకుంటున్నారు. తెలంగాణ ప్రభు త్వ చర్యలతో బ్యాంకులు సైతం ఇతోదికంగా రుణాలను అందిస్తున్నాయి. రుణమాఫీ తదితర పథకాలు సైతం రైతులకు ఊరటనిచ్చాయి. పంటల సాగు విస్తీర్ణం పెరగ డం.. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాకుండా.. సకా లంలో చెల్లింపులు జరిపి ప్రతి యేటా మనోధైర్యంతో పం టల సాగుకు ఉపక్రమిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో పంటల సాగు లక్ష ఎకరాల్లోపే ఉండ గా.. ప్రస్తుతం మూడింతలు పెరిగింది.
రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలి చారు. గత రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అనేక హామీ లను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, పంట పెట్టుబడి, రైతు బీమా పథకాలు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. రైతు బంధు డబ్బులు మరింత పెంచుతామని ప్రకటించి, అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రైతులంతా రుణపడి ఉంటారు.
– కొలన్ శ్రీకాంత్రెడ్డి, చందనవెళ్లి, షాబాద్
సీఎంకేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం రెండు పంటలకు ఇస్తు న్న పంట పెట్టుబడి సాయం రూ.10 వేలను, అధికారంలోకి రాగానే రూ.16 వేలకు పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం. రైతులు బాగోగులు చూసే ముఖ్యమంత్రి మన రాష్ర్టానికి ఉండడం మా అదృష్టం. సీఎం కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న మేలును ఎప్పటికీ మరువలేం. గతంలో వ్యవసాయం చేయాలంటే అప్పులు చేసేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రైతులకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే నా ఓటు.
-సభావట్ శ్రీనునాయక్, కడ్తాల్
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా పని చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధం గా రైతుల సంక్షేమ కోసం రైతు బందు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్ తదితర పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు.. రైతు బంధు ద్వారా సంవత్సరానికి రూ. 10వేలు ఇచ్చే రైతు బంధును ఏడాదికి రూ.16వేల వరకు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో యావత్ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు రైతులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్, నందిగామ
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభు త్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించి అదుకుంటున్నది. రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10వేలను రైతున్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతు బంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా రూ.12వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోను విడుదల చేయడం హర్షణీయం. అందరికీ న్యాయం చేకూరేలా పథకాలను ప్రవేశ పెట్టడం సంతోషకరం. ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలి.
– రాములు గౌడ్, చేవెళ్ల టౌన్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించా రు. రైతులు పెట్టుబడి కోసం ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ముఖ్య ఉద్దేశంతో రైతు బంధు ప్రవేశ పెట్టి సంవత్సరానికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చి ఆదుకుంటున్నారు. మళ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యాని ఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేండ్లలో ఎకరాకు రూ.16 వేలు వరకు పెంచుతామని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న ప్రేమ ఎందో తెలుస్తున్నదన్నారు. ఇలాంటి సీఎం మరోసారి అధికారంలోకి రావాలి. కారు గుర్తుకు ఓటు వేస్తా.
– పాత్లావత్ సుమన్ నాయక్, ఆమనగల్లు
దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగా ణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం పెంచుతామని మ్యానిఫెస్టోలో ప్రకటించ డం ఎంతో సంతోషకరం. గతంలో పంటల సాగుకోసం ఇతరుల వద్ద అప్పులు చేసి పంటలు సాగు చేసే వాళ్లం. దిగుబడి వచ్చే సమయానికి పంటలకు తెగుళ్లు సోకడం, అకాల వర్షాలతో పంటలు చేతికి వచ్చేవి కావు. ఇలాంటి పరిస్థితిలో రైతు బంధు పథకాన్ని తీసుకురావడమే కాకుండా మరోసారి ఈ సహాయం పెంచుతామని ప్రకటించడం హర్షణీయం.
– ఏనుగు బుచ్చిరెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నంరూరల్
రైతుబంధు సాయం ఎకరాకు రూ.16వేలు పెంపు నిర్ణయం ఎంతో సంతోషంగా ఉం ది. ఇంతకు ముందు వస్తున్న రైతుబంధు సాయంతో అప్పులు లేకుండా చేసుకు న్నా. ఇప్పుడు రూ.16వేల వరకు పెంచుతా మని హామీ ఇచ్చారు. గతంలో ఏ సర్కారు చేయలేని పని సీఎం కేసీఆర్ సార్ చేశారు. రైతుల కోసం ఆయన చేసిన మేలు మరువలేనిది. రాష్ట్రంలోని రైతులందరూ ఆయనకు రుణపడి ఉం టారు. రైతుబంధు సాయం పెంపు నిర్ణయంతో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది. వడ్డీలకు అప్పు చేయకుండా రైతులు ధైర్యంతో పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తారు. రైతుల మేలు కోరే కేసీఆర్ మళ్లీ గెలవాలి.
– దోస సాలయ్య, మేడిపల్లి నక్కర్త, యాచారం
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవు తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం తీసుకొచ్చారు. రైతుబందు పథకం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్ద చేయి చాచకుండా వ్యవసాయం చేసుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పంట పెట్టుబడి సాయాన్ని పెంచుతామని చెప్పిన మాట విన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఉమ్మడి పాలనలోని ప్రభుత్వాలు రైతులను పట్టించుకొనే వారే లేరు. పంట పెట్టుబడి కోసం సావుకారుల వద్ద అప్పులు చేసేవాళ్లం. పంట చేతికొచ్చాక వచ్చిన డబ్బు అప్పు కట్టడానికే సరిపోయేది. పంట సాగు కాలంలో ఏదైనా విపత్తు జరిగి పంట నష్టం ఆదుకొనే వారు లేరు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు సాయం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాం.
– మోహన్లాల్, రైతు, వెల్జాల్, తలకొండపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మబం ధువు. రైతుల కోసం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు పథకం ద్వారా పంటలకు పెట్టు బడి సహాయం అందించి ఆదుకోవడమే కాకుండా మరోసారి రైతుబంధును ఏడాదికి రూ.16వేలు అందిస్తామని ప్రకటించటం హర్షణీయం. ఇంతగొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. యావత్తు రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ సార్ను గెలిపించుకుంటాం.
– బుట్టి మహేశ్, ఇబ్రహీంపట్నంరూరల్