సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలో ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా టంగటూరు గ్రామ శివారులోని మూసీవాగుపై రూ.12.90 కోట్లతో నిర్మించతలపెట్టిన వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చని చెట్లు, ప్రకృతి వనాలతో పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయని అన్నారు.
రంగారెడ్డి, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/శంకర్పల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామ శివారులోని మూసి వాగుపై రూ.12.90 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి ప్రారంభించారు. అనంతరం టంగటూరు గ్రామంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.10.47 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక పాఠశాల, 16.68 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించారు. అలాగే టంగటూరు గ్రామంలో 90 లక్షల నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి తెలంగాణ ప్రజల అభ్యున్నతికి నిరంతరం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారన్నారు.
రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తూ రైతు బాంధవుడు అయ్యాడని కొనియాడారు. నిరుపేద ప్రజలకు ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆడపడుచుల తల్లిదండ్రులకు భరోసాను కల్పిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గత పాలకుల పాలనలో నలిగిపోయిన పేదల బతుకులకు సీఎం కేసీఆర్ జీవం పోశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి పాటు పడుతూ సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకూ అందిస్తున్నారన్నారు. అన్ని మతాలకు సమన్యాయం చేస్తూ సంక్షేమ ఫలాలను అందరికీ అందిస్తున్నారని తెలిపారు.
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయన్నారు. బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయకుండా వివక్ష చూపుతుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలిచే సమయం వచ్చిందని అన్నారు. గ్రామాల్లో మనం చూస్తున్న అభివృద్ధే సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమని కొనియాడారు. టంగటూరు ప్రజల ఏండ్ల నాటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాతీలకు గులాములుగా బతకాల్సిన ఖర్మ తెలంగాణ ప్రజలకు పట్టలేదని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసి గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేశ్, సర్పంచులు గోపాల్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మండల విద్యాధికారి అక్బర్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, గోపాల్, మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్, కౌన్సిలర్లు శ్రీనాథ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్, గోవర్ధన్రెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.