యాచారం : మండల కేంద్రం నుంచి మేడిపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుపై పలు చోట్ల గుంతలమయం కావటంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే గాండగూడ నుంచి మల్కీజ్గూడ వరకు రోడ్డు వేసిన మూనాళ్లకే గతుకుల రోడ్డుగా మారింది. బీటి కొట్టుకుపోవడంతో కంకర తేలి గుంతలతో దర్శనమిస్తుంది.
దీనికి తోడు వర్షకాలంలో కావడంతో గుంతల్లో నీరు నిలువడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికైన ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గాండ్లగూడ ఆరంబంలోనే సాగర్రోడ్డు నుంచి వెళ్లే బైపాస్ రోడ్డు మట్టికొట్టుకుపోయి అధ్వాన్నంగా తయారైంది. వాహనదారులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయించి ప్రయాణీకుల అవస్థలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.