ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది. ప్రసుత్తం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,203 ఉండగా.. మార్కెట్లో రూ.వెయ్యి నుంచి రూ.1,300 అధికంగా వస్తున్నది. ఈ రకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగుండడం, నూనెశాతం తక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు.
అదేవిధంగా గతంలో వేసే బీపీటీ (సోన రకం), దొడ్డు రకం ధాన్యాన్ని రైతులు అంతగా సాగు చేయకపోవడం కూడా ఆర్ఎన్ఆర్కు డిమాండ్ పెరిగింది. అన్ని మార్కెట్లలో పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలంలో రైతులు 1,30,751 ఎకరాల్లో వరిసాగు చేయగా, 3,34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
– షాబాద్, డిసెంబర్ 18
షాబాద్, డిసెంబర్ 18 : ప్రస్తుత మార్కెట్లో సన్న వరిధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. క్వింటాల్ సన్న వడ్ల ధర రూ.3500 లభిస్తున్నది. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా బయట మార్కెట్లో ధర పలకడంతో రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని విక్రయిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రేటు పలుకుతుంది. గత సీజన్లో క్వింటాల్కు రూ.2600 మాత్రమే ధర పలికింది. ఈ ఏడాది వానకాలం సీజన్కు ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాల్కు రూ.2,203 ఉండగా… మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1300 వరకు అధికంగా వస్తుంది.
రైతులు దొడ్డు రకం వరిని ఎక్కువగా సాగు చేయకపోవడంతో సన్న రకం వడ్లకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, రాయచూర్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వడ్లకు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు రైతులకు ఫలితాలనిస్తున్నాయి. దీంతో రైతులు మార్కెట్ యార్డులకు వడ్ల బస్తాలతో పోటెత్తుతున్నారు. రంగారెడ్డిజిల్లాలో ఈ వానకాలం సీజన్లో రైతులు 1,30,751 ఎకరాల్లో వరిసాగు చేయగా, 3.34లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. అన్ని మార్కెట్లలో పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి), రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో ఈ ఏడాది వానకాలం సీజన్లో రైతులు 1,30,751 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. ఇందులో 3.34లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. క్వింటాల్కు రూ.2200 నుంచి ప్రారంభమైన ధర రోజురోజుకూ పెరుగుతూ ప్రస్తుతం రూ.3500కు చేరుకుంది.
దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ సన్నరకం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర వస్తుంది. రాష్ట్ర మార్కెట్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్కు క్యూకట్టారు. దీంతో మార్కెట్కు ధాన్యం పెద్ద ఎత్తున అమ్మకానికి వస్తుంది. గత సీజన్లో క్వింటాల్కు రూ.2600లకు పైగా ధరలు పలుకగా, ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయికి చేరుకున్నది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,203 ఉండగా, మార్కెట్లో క్వింటాల్కు రూ.3500 ధర పలుకుతుంది. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన)ఈ రకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనెశాతం తక్కువ ఉండడంతో డిమాండ్ పెరిగింది. అదే విధంగా గతంలో వేసే బీపీటీ(సోనరకం), దొడ్డు రకం ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఆర్ఎన్ఆర్కు డిమాండ్ అధికంగా వస్తుంది.
బోరుబావుల కింద సాగుచేస్తున్న వరిపంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నాణ్యతను బట్టి వస్తున్నాయి. పొలాల వద్ద యంత్రాలతో పంటను నూర్పిడి చేసుకుని మార్కెట్లకు తీసుకువెళ్లి వడ్లను విక్రయిస్తున్నారు. గతంలో ఎండబెట్టిన తర్వాత కూడా ధరలు సరిగ్గా వచ్చేవి కావని చెబుతున్నారు. ఇప్పుడు నేరుగా పొలాల వద్ద నుండే మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో 24గంటల కరెంట్తో వరిపంట సాగు చేసుకుంటే ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
మార్కెట్లో వడ్లకు మంచి ధర రావడం సంతోషంగా ఉంది. గతంలో రూ.2వేలు క్వింటాల్కు అమ్మలేదు. కానీ ఇప్పుడు రూ.3వేలు దాటింది. ఆర్ఎన్ఆర్ సన్నరకం వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రెండు ఎకరాల పొలంలో వరిసాగు చేశాను. దిగుబడులు మంచిగానే వచ్చింది. మార్కెట్లో ధాన్యం విక్రయించాను. ఖర్చులు పోగా మాకు మంచి లాభాలే వచ్చాయి.
– పి. కృష్ణయాదవ్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
వరికి ఒక్కసారిగా ఇంత ధర పెరుగుతుందని అనుకోలేదు. రెండు ఎకరాల పొలంలో వరిపంట వేశాను. పంట దిగుబడి మంచిగానే వచ్చింది. చేవెళ్ల మార్కెట్కు ధాన్యాన్ని తీసుకువచ్చాను. మార్కెట్కులో వడ్లకు మంచి ధర ఉండడం సంతోషకరం. పెరిగిన ధరలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– సత్తార్, గొల్లపల్లి, చేవెళ్ల మండలం