కడ్తాల్ : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హారతీ, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. బియ్యం, బెల్లంతో వండిన నైవేద్యాన్ని తయారు చేసి, బోనం కుండలతో మహిళలు అమ్మవారికి సమర్పించారు. అంతకు ముందు గ్రామంలోని ప్రధానవీధుల గుండా మహిళలు బోనాలతో ఊరేగింపును నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో తొట్టెలను ఊరేగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, నాయకులు భిక్షపతి, రాంచంద్రయ్య, మల్లయ్య, కృష్ణ, శ్రీకాంత్, అంజయ్య, మహేశ్, శంకర్, సత్యం, జంగయ్య, చంద్రయ్య, రమేశ్ పాల్గొన్నారు.