‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామాలు, వర్మీకంపోస్టు షెడ్లతోపాటు పల్లెప్రకృతి వనాలు, హరితహారం నర్సరీలతో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వీటికి తోడు నిత్యం పంచాయతీ ట్రాక్టర్లతో ఇంటింటికెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా అన్ని గ్రామపంచాయతీల్లో సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఎరువును హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాల్లోని మొక్కలకు వినియోగించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే అమ్ముతున్నారు. దీంతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ సత్ఫలితాలిస్తుండడంతో పల్లెజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 25
ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 25: గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అధోగతి పాలైన గ్రామాలను స్వచ్ఛతతోపాటు అభివృద్ధిలోనూ ముందు ఉంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రభు త్వం ప్రతినెలా కేటాయిస్తున్న నిధులతో గ్రామా లు ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నా యి. రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామాలు, వర్మీకంపోస్టులతోపాటు పల్లెప్రకృతివ నాలు, హరితహారం నర్సరీల ఏర్పాటుతో గ్రా మాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వీటి కి తోడు ప్రతి గ్రామపంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ చొప్పున సమకూర్చడంతో మొక్కలకు తడులవారీగా నీటిని అందించేందు కు.. గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి వర్మీకంపోస్టు షెడ్డులకు తరలించేందుకు ట్రాక్టర్లు ఎంతో దోహదపడుతున్నాయి. అక్కడ ఆ చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని దా దాపుగా అన్ని గ్రామపంచాయతీల్లో సేంద్రియ ఎరువు ఉత్పత్తి జరుగుతుండగా..దానిని రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. ఈ సేంద్రియ ఎరువును హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాల్లోని మొక్కలకు వినియోగించ డం ద్వారా అవి ఏపుగా పెరుగుతున్నాయి.
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..
జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ఇండ్ల నుంచి పారిశుధ్య కార్మికులు సేకరించిన తడి, పొడి చెత్తను ట్రాక్టర్ల ద్వారా వర్మీకంపోస్ట్ షెడ్డులకు తరలిం చి..అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్, కప్పాడు గ్రామాల్లో అప్పటి కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ పర్యటిం చి వర్మీ కంపోస్ట్పై దృష్టి సారించాలని సూచించడంతో అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. గ్రామాల్లో చెత్త కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. తడి, పొడి చెత్తను సేకరించి వర్మీకంపోస్ట్యార్డుకు తరలించి అక్కడ సిబ్బందితో సేంద్రియ ఎరువును తయా రు చేయిస్తున్నారు.
ఆ ఎరువును గ్రామాల్లోని పలువురు రైతులకు వారి అవసరం మేర తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలతోపాటు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ఈ వర్మీకంపోస్ట్ ఎరువును వినియోగిస్తున్నారు. కప్పాడు గ్రామంలో తయా రు చేసిన సేంద్రియ ఎరువును సర్పంచ్ సామల హంసమ్మ భర్త తమ వ్యవసాయ పొలంలో మొరంగడ్డల సాగుకు వినియోగించి మంచి దిగుబడిని సాధించినట్లు తెలిపారు. దీంతో గ్రామంలోని పలువురు రైతులు కూడా ఈ ఎరువును వాడేందుకు మొగ్గు చూపుతున్నారు.
రసాయన ఎరువులు వాడొద్దు
గ్రామాల్లో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతోటలకు అందించటం ద్వారా మంచి దిగుబడిని సాధించొచ్చు. రైతులు రసాయన ఎరువులను వాడొద్దు.
-కనకలక్ష్మి, ఉద్యానవన అధికారి
మంచి దిగుబడి వచ్చింది
గ్రామంలోని వర్మీ కంపోస్టు షెడ్డులో తయారైన సేంద్రి య ఎరువును కొనుగోలు చేసి.. నా పొలంలో మొరం గడ్డల సాగుకు వినియోగిం చగా మంచిదిగుబడి వచ్చిం ది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ హంసమ్మ సేంద్రియ ఎరువు వినియోగంతో పంటల సాగులో మంచి దిగుబడి వస్తుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో మా గ్రామంలోని చాలామంది రైతులు ఈ ఎరువును కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు.
-యాదగిరిరెడ్డి, రైతు కప్పాడు
ఎరువుతో గ్రామపంచాయతీకి ఆదాయం
గ్రామంలోని ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు యార్డుకు తరలించి అక్క డ సేంద్రియ ఎరువును పంచాయతీసిబ్బంది తయారు చేస్తున్నారు. ఆ ఎరువును పంటల సాగులో వినియోగించడం ద్వారా మంచి దిగుబడి వస్తుందని తెలుసుకున్న రైతులు కొనేందుకు ముందుకు వస్తుండటంతో గ్రామపంచాయతీకి మంచి ఆదా యం సమకూరుతున్నది.
-విక్రమ్, పంచాయతీ కార్యదర్శి, కప్పాడు