షాద్నగర్టౌన్, జనవరి 7 : ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు షాద్నగర్ ఆర్టీసీ డిపోలో డీఎం మేనేజర్ ఉష ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. అనంతరం వనభోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.