ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యువత విద్యారంగంతో పాటు క్రీడాల్లోను ముందుండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగ్లూరు సమీపంలో గల బిగ్బాట్ క్రికెట్గ్రౌండ్లో ఎంకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బంటియూత్ఫోర్స్ సభ్యులకు క్రికెట్ టోర్నమెంట్ను సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్య, ఉద్యోగవకాశాలు, క్రీడల్లో యువత ముందుండటం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరికి ఎంకేఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించేందుకు ఇప్పటికే రెండు విడుతలుగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహించామన్నారు.
మూడో విడుత ఉద్యోగాల్లో కూడా అధికశాతం నియోజకవర్గం నుంచే సాధించాలన్న సంకల్పంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా యువతకు క్రీడాపోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని యువతకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఇప్పటికే పలుమార్లు యువకులకు క్రీడాపోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు. యూత్ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మంచాల మండలానికి చెందిన జట్టు మొదటి బహుమతి, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన జట్టుకు రెండో బహుమతి రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో బంటి యూత్ఫోర్స్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.