షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి షాబాద్ మండల పరిధిలోని సోలీపేట్, మద్దూర్ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన్నట్లు వివరించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసరా పింఛన్ ద్వారా అందిస్తున్నరూ. 2016ను నెలనెల పింఛన్ ఇచ్చే వ్యక్తి రూ. 16 పట్టుకుని మాకు రూ. 2వేలు మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ ఇచ్చే వ్యక్తికి ఫోన్ చేసి వచ్చే నెల నుంచి పూర్తి డబ్బులు అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంతో నిధులు మంజూరు కాలేదని, రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నల్లానీటి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సోలీపేట్ నుంచి హైతాబాద్ వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు దశలవారిగా పరిష్కరిస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే నిర్వహిస్తున్న శుభోదయం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు రమ్యరాంచంద్రారెడ్డి, నరేందర్రెడ్డి, మల్లేశ్, ఎంపీటీసీ మామిడి లత, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మల్లేశ్, డైరెక్టర్ సూద యాదయ్య, టీఆర్ఎస్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, బీసీసెల్ అధ్యక్షుడు సుధాకర్గౌడ్, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్రెడ్డి, ఏఈలు శ్రీదివ్య, నరేందర్, ఏపీవో వీరాసింగ్, ఏపీఎం నర్సింలు, పార్టీ నాయకులు కావలి గోపాల్, రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, రమేశ్యాదవ్, శంకర్, దేవేందర్, రాందేవ్యాదవ్, ఆవిలాశ్గౌడ్, మహిపాల్రెడ్డి, బురాన్, బాబు, రాజుగౌడ్ పాల్గొన్నారు.