ఇబ్రహీంపట్నం : స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చేపట్టిన స్వచ్ఛ అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఇబ్రహీంపట్నం మన్సిపాలిటీని రాష్ట్రంలో గుర్తించిన 8 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంను ఎంపిక చేశారు. రాష్ట్రపతి అవార్డుకు మున్సిపాలిటి ఎంపికైంది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటికీ రాష్ట్రపతి అవార్డు రావడం గర్వించదగ్గ విషయమన్నారు.
ఈ అవార్డు రావడం మున్సిపల్ ప్రజలు, సిబ్బంది, పాలకవర్గం కృషి మరువలేనిదన్నారు. మున్సిపాలిటీ తరుపున అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.