షాద్నగర్టౌన్ : తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాణాలను పనంగా పెట్టి అహింస మార్గంతో ప్రత్యేక తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికీ కృషి చేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా వివిధ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూనే దళిత వర్గాలను ఆర్థికంగా ఎదుగేందుకు దళితబంధు పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసి రైతు బాంధవుడుగా నిలిచాడన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సింహ, రాజు, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.