మొయినాబాద్ : నీట్ పరీక్ష రాసిన చిలుకూరు గురుకుల విద్యార్థులు ఇద్దరు అద్భుత ఫలితాలు సాధించి ఎంబీబీఎస్లో సీటు సాధించి చిలుకూరు గురుకుల కళాశాల ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు ఇంటర్లో బీపీసీ గ్రూప్లో చేరారు. చిలుకూరు గురుకుల కళాశాలలో విద్యార్థులకు నీట్ శిక్షణ కూడా ఇచ్చారు. 18మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ నీట్ శిక్షణ కూడా పొందారు. అందులో అనీల్కుమార్, శ్రావణ్కుమార్ ఎంబీబీఎస్లో సీటు సంపాధించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించిన చిలుకూరు కళాశాల విద్యార్థులు కళాశాల ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారిని చిలుకూరు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పాపారావు, వైస్ ప్రిన్సిపల్ మోహన్శంకర్లు ప్రత్యేకంగా అభినందించారు.
మరో 11మంది విద్యార్థుల ప్రభంజనం..
చిలుకూరు గురుకుల కళాశాల యందు ప్రత్యేకంగా గురుకుల కళాశాల, ఇతర కళాశాలలో చదివిన ఎస్సీ విద్యార్థులకు నీట్ ప్రవేశపరీక్ష కోసం లాంగ్టర్మ్ శిక్షణ ఏర్పాటు చేశారు. గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు గతేడాది ఇంటర్ చదువుతూ నీట్ పరీక్షకు హాజరై సీటు సాధించకపోవడంతో తిరిగి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. అయితే 29మంది విద్యార్థులు లాంగ్టర్మ్ కొచింగ్ తీసుకోగా అందులో 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో సీటు సాధించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించిన విద్యార్థుల్లో పి. ఈశ్వర్, ఎం. బాపురావు, సీహెచ్ వీరబాబు, ఎండీ జాఫర్, కె.ఉమేష్చంద్ర, జే. విష్ణువంశీ, కె. ఉదయ్కిరణ్, డి. అన్వేష్, బి. అనీల్కుమార్, ఈ. ఉదయ్కిరణ్, జీ. మురళీకృష్ణ ఉన్నారు. వీరిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారద ప్రత్యేకంగా అభినందించారు.