షాబాద్ : మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. శనివారం గాంధీజీ 152వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస మార్గమును ఎంచుకొని స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు. విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, ఏఓ ప్రమీల, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.