నందిగామ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్లతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, ఎంపీటీసీ చంద్రపాల్రెడ్డి, ఉపసర్పంచ్ కుమార్గౌడ్, నాయకులు లింగంగౌడ్, పెంటయ్యగౌడ్, కృష్ణయ్య, రాములు, శ్రీనివాస్రెడ్డి, నర్సింహా, రవీందర్, అశీర్వాదం పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ నందిగామ గ్రామానికి చెందిన ఎమ్.డి అనిశ్ బెగమ్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజురైన రూ. 44,000 చెక్కును లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు.