శంకర్పల్లి : శంకర్పల్లి మండలంలో నర్సరీలు అంగన్వాడీల నిర్వాహన బాగుందని కొత్తగా అధికారిగా ఎంపికైన ఐఏఎస్ అధికారి మేఘన అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్వెర్తి, మాసానిగూడ గ్రామాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాల ద్వారా గ్రామాలు పచ్చబడ్డాయన్నారు. అలాగే గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీల నిర్వాహణ బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ఏపీఓ నాగభూషణం, మాసానిగూడ, ఎల్వెర్తి సర్పంచులు రాములు, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.