ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2: ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని మృతి చెందిన, అస్వస్థతకు గురైన ఘటనపై విచారణ ప్రారంభమైంది. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానను పరిశీలించి.. ఆపరేషన్ థియేటర్లో ఉన్న సౌకర్యాలు, కు.ని. ఆపరేషన్లు చేసిన రోజు వినియోగించిన పరికరాలను పరిశీలించారు. అలా గే, ఆపరేషన్లు చేసిన ఇద్దరు డాక్టర్లను విచారిస్తామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబసభ్యులను కూడా కలుస్తామని, విచారణ లోతుగా జరుగుతుండటం తో పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయం వెల్లడవుతుందన్నారు.
ప్రభుత్వానికి నివేదిక అందజేసిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలుంటాయని డీహె చ్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుని.. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తామన్నారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వాసెక్టమీ ఆపరేషన్లపైనా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామన్నారు. గతనెల 25న ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని, ఆపరేషన్లు చేయించుకున్న వారిని అదే రోజు సాయంత్రం వారి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు.
48 గంటల తర్వాత వారిలో ముందుగా నలుగురు అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు దవాఖానలకు తరలించగా అక్కడ వారు చికిత్స పొం దుతూ మృతిచెందారన్నారు. ఈ విషయంపై వెం టనే స్పందించిన ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ మిగిలిన వారిని మెరుగైన వైద్యంకోసం నగరంలోని వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. చికిత్స పొందుతున్న వారం తా ఆరోగ్యంగా ఉన్నారని, వారిలో 11 మందిని శుక్రవారం డిశ్చార్జి చేస్తున్నట్లు..మిగిలిన వారందరినీ మరో రెండు రోజుల్లో ఇండ్లకు పంపుతామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, మృతిచెందిన వారి కుటుంబాలకు వైద్యారోగ్యశాఖ తరఫున ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి, ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.