షాద్నగర్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పట్నం మహేందర్రెడ్డిని గురువారం చేవేళ్ల ఎంపీ రంజీత్రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు, ప్రధాన నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.