ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పంటలు సాగు చేసుకునేందుకు దైవాజ్ఞతో పుష్కలంగా వర్షాలు కురిసి నీరు ఉన్నందున పచ్చని పంటలతో నియోజకవర్గం తులాతూగాలన్నారు. ఇబ్రహీంపట్నం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని తెలిపారు.
అనంతరం ఆయన పరిసరాల్లో కలియతిరిగి ఆలయ ప్రాంగణంలో ఎలాంటి సమస్యలున్నాయనే దానిపై ఆరాతీశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు గాజుల గోపాల్ ఉన్నారు.