దోమ : మండల పరిధిలోని దొంగఎన్కెపల్లి (సంజీవనగర్) గ్రామంలో జరుగుతున్న సంజీవస్వామి రథోత్సవ వేడుకలు (జాతర) ఉత్సవాల్లో జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డి పాల్గొని సంజీవస్వామిని దర్శించుకున్నారు. రథోత్సవ వేడుకలకు హాజరైన జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో సన్మానిచారు. ఈ కార్యక్రమానికి దోమ మండల సర్పంచుల సంఘం అధ్యుక్షుడు రాజిరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, తెరాస అధ్యక్షుడు ఆంజనేయులు, బాబయ్య, బిచ్చన్న పాల్గొన్నారు.