అబ్దుల్లాపూర్మెట్ : రాజీవ్ స్వగృహకు కేటాయించిన భూములను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ బుధవారం పరిశీలించారు. మండలంలోని కవాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 148, 35లో గల 40ఎకరాల భూములను ఆర్డీఓ వెంకటాచారితో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో ప్రభుత్వం రాజీవ్ స్వగృహకు కెటాయించిన భూమిలో పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. సర్వే నం. 148లో 30ఎకరాలు, సర్వే నం. 35లో 10ఎకరాల భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు స్థానిక రైతులు తాము ఎన్నో ఏళ్లుగా సర్వే నం. 148లో కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. తమకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయని జాయింట్ కలెక్టర్కు వివరిస్తూ చూపించారు. తమ భూమిని రాజీవ్ స్వగృహకు కెటాయించి హద్దులను ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు.
తమకు న్యాయం చేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైతులు జాయింట్ కలెక్టర్రు కోరారు. రైతుల పాస పుస్తకాలు పరిశీలించి వారికి సంబందించిన భూమిని గుర్తించి చూపిస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. గురువారం నుంచి రాజీవ్స్వగృహకు కెటాయించిన భూమిలో పనులను ప్రారంభించాలని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ప్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐపాస్) అధికారులను ఆదేశించారు. పనులను రైతులు అడ్డుకోవద్దని తమకు న్యాయం చేస్తామని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ వెంకటేశ్వర్లు, సత్యనారాయణరావు, సర్పంచ్ దూసరి సుజాతయాదయ్య గౌడ్, సర్వేయర్ సాయికృష్ణారెడ్డి, అస్టెంట్ బాల్రాజ్, వీఆర్వో ప్రసాద్, ముని తదితరులు ఉన్నారు.