రంగారెడ్డి, ఏప్రిల్ 11, (నమస్తే తెలంగాణ): జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ ము ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో నిర్మాణ సంస్థ పనులను వేగంగా పూర్తి చేసి ఏప్రిల్ 2వ తేదీన భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించింది. మరోవైపు నూతన కలెక్టరేట్లో అన్ని శాఖలకు గదుల కేటాయింపు ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేశారు. పనులు పూర్తి కావడంతో తుది మెరుగులను దిద్దుతున్నా రు. కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట రహదారుల నిర్మాణ పనులు పూర్తికాగా, ప్రస్తుతం ప్రాంగణంలోని గ్రీన్ పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో వారం, పది రోజుల్లో చిన్న, చిన్న పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్ను కూడా సిద్ధం చేశారు. కొంగరకలాన్లోని సర్వేనంబర్ 300 లోని 40 ఎకరాల్లో రూ.32 కోట్లతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది.
గ్రౌండ్ ఫ్లోర్లో 42 గదులు..
నూతన కలెక్టరేట్లో కలెక్టర్ కార్యాలయంతోపాటు అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఇతర శాఖల అధికారుల కార్యాలయాలు, బ్యాంకు, ఏటీఎం, దవాఖానకు గదుల కేటాయింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. అయితే కలెక్టర్తోపాటు ఆయా శాఖల అధికారులకు కేటాయించిన గదులకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో 42 గదులు, మొదటి అంతస్తులో 29 గదులు, రెండో అంతస్తులో 34 గదులను కలిపి మొత్తం 105 విశాలమైన గదులను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ చాంబర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్అండ్బీ శాఖ, కలెక్టరేట్ పరిపాలన అధికారి, కలెక్టరే ట్ రెవెన్యూ విభాగాలు, జిల్లా సహకార అధికారి, ఈ-జిల్లా మేనేజర్, మహిళా, శిశు సం క్షేమం, డీఐవో, ఎన్ఐసీ, టీ-ఫైబర్తోపాటు రికార్డు గది, స్ట్రాంగ్రూం, ఎలక్ట్రిసిటీ గది, స్టోర్ గది, మినీ కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరం, వెయిటింగ్హాల్, లంచ్, రెస్ట్ గదులు, పోస్టాఫీసు, బ్యాంకు, ఏటీఎం, దవాఖాన, రెడ్క్రాస్కు ఇందులో గదులను కేటాయించారు.
మొదటి అంతస్తులో 29 గదులు..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, నీటి పారుదల శాఖ, డీపీఆర్వో, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ, జిల్లా ఖజానా అధికారి, ఎస్డీసీ(ఎల్పీ), జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, ఎస్డీసీ(ఎల్ఏ), ఎస్డీసీ(యూఎల్సీ), ఎలక్ట్రిసిటీ గది, సర్వర్ గది, సమావేశ మందిరం, బీఎస్ఎన్ఎల్ సర్వర్కు మొదటి అంతస్తులో గదులను కేటాయించారు.
రెండో అంతస్తులో 34 గదులు..
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్, ముఖ్య ప్రణాళిక అధికారి, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్, గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయం, గనులు, భూగర్భశాఖ ఏడీ, ఏడీ(ఎల్-ఎస్ఆర్), జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ప్రొబెషనరీ అధికారి, హౌసింగ్ పీడీ, మెప్మా పీడీ, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, మత్స్యశాఖ ఏడీ, జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయాలకు రెండో అంతస్తులో గదులను కేటాయించారు.