షాద్నగర్టౌన్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల, గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని షాద్నగర్ నూర్ కాలేజీలో కొనసాగుతున్న నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్నచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్లో కనీసం 40శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీ, ఎంఎస్సీఎస్), బీకాం కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 10నుంచి జనవరి 10వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు జనవరి 23న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు tswreis.ac.in, telangana gurukulam.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.