ఇబ్రహీంపట్నంరూరల్ : శాసనమండలి సభ్యురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గాంధీ ఫ్యామిలీ, గాంధీగ్లోబల్ సంస్థల చైర్మన్ గున్నారాజేందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్లు నగరంలోని ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గాంధీగ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రతినెల పదిరోజుల పాటు ప్రముఖ ప్రకృతి వైద్యులు రామచందర్రావు సమక్షంలో నిర్వహిస్తున్న ప్రకృతి వైద్యానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నరన్నారు.
ఈ ప్రకృతి వైద్యాన్ని తరించడంతో పాటు గోశాల పరిసరాల్లోని ప్రకృతి అందాలను తిలకించేందుకు ఎమ్మెల్సీని ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గాంధీగ్లోబల్ సంస్థ సభ్యులు అరదీప్రెడ్డి, మోహన్, సందీప్ తదితరులు ఉన్నారు.