కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆరో రోజు అమ్మవారికి అర్చనలు, హరతీ, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఘనంగా రథోత్సవం…
మైసిగండి మైసమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దతేరును వివిధ రకాల పూలతో ముస్తాబు చేశారు. ముస్తాబు చేసిన తేరులో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తేరును ఆలయ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, భక్తులు ఊరేగించారు. ఆలయ పరిసరాలన్నీ మైసమ్మతల్లి నామస్మరణతో మారుమోగాయి. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ ఉపేందర్ ఆధ్యర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, మహేశ్వరం తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, సర్పంచ్ తులసీరాంనాయక్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.