కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండాకు చెందిన దర్జీనాయక్కి రూ. 12వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైంది. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్సీ వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లుగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, మోత్యానాయక్, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, యాదగిరిరెడ్డి, జహంగీర్అలీ, శ్రీకాంత్రెడ్డి, బిక్కునాయక్, నరేశ్నాయక్, వెంకట్రెడ్డి, ప్రభులింగం, రమేశ్ పాల్గొన్నారు.