చేవెళ్ల టౌన్ : బాలికల సంపూర్ణ సాధికారతకు సమాన అవకాశాలు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ వికలాంగుల శాఖ నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సాత్విక, పాఠశాల ప్రిన్సిపాల్ టి.టేనావతి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా చెక్కును అందుకున్నారు.