కొందుర్గు : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జంగయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనేందుకు నిరాకరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులను పీఎసీఎస్ అధికారులు అందజేయాలని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు కరోనా టీకా రెండుసార్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. టీకా తీసుకుంటే కరోనా వ్యాధి సోకే లక్షణాలు తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత యాసంగిలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.