కౌకుంట్ల,(చిన్న చింతకుంట) జూలై 23 : కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చింతకుంట మండల పెద్ద వడ్డెమాన్లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండలంలోని దమగ్నాపూర్, నెల్లికొం డి, సీతారాంపేట, పెద్ద వడ్డెమాన్, చిన్న వడ్డెమాన్ గ్రామాల బూత్ల వారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా కార్యచరణ చేపట్టాలన్నారు. సర్పై కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి సహకరించాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించడంలో విఫలమైన విధానాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.