ఇబ్రహీంపట్నం జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలోని ఊరూరా నిర్వహించిన నిరసన విజయవంతంగా ముగిసింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని అన్ని గ్రామాలతో పాటు ప్రతి వార్డులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. యాచారంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కిషన్రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డితో పాటు రాష్ట్ర ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డి, ఉద్యమ నాయకులు బర్ల జగదిశ్యాదవ్, బోడ చంద్రప్రకాశ్, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మహేందర్రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు బహదూర్, వెంకటేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వినర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటి కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.