తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా నియమించారు. కమిటీ సభ్యులుగా వట్టేల శ్రీశైలంయాదవ్, బైండ్ల కిష్టమ్మ, అంజిరెడ్డి, నిమ్మల జంగయ్య, కటికెల కొమ్రయ్య, పబ్బల తిరుపతయ్యలను కమిటీ సభ్యులుగా నియమించడంతో సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను కలిసి చైర్మన్ ఎన్నికకు హాజరు కావాలని కోరారు.
రాంపూర్ ఆలయ అభివృద్ధికి తగిన కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అన్నారు. తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు నూతనంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.