తలకొండపల్లి, సెప్టెంబర్ 19 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని.. ఈ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారానికి చెందిన సర్పంచ్ వెంకటయ్యయాదవ్తోపాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్లకు చెందినవారు ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయం
షాద్నగర్టౌన్ : అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మహేశ్, ప్రేమ్కుమార్, విద్యాసాగర్, కృష్ణ, బుచ్చిరెడ్డి, వెంకట్రెడ్డి, బాలరాజు, కృష్ణప్రసాద్, సతీష్కుమార్, ఉదయ్కిరణ్, రమేశ్రాజు, మహేశ్, జగదీశ్చారి, రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, మల్లేశ్, నరేందర్రెడ్డి, రాములు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో కొందుర్గు మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకులున్నారు.
ప్రతిపక్షాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు
కడ్తాల్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రజలులేరని.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోమవారం ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, ఉప సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గులాబీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ఉపసర్పంచ్ వెంకటేశ్, రైతు బంధు సమితి మండల, గ్రామ అధ్యక్షులు వీరయ్య, బాలకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు రమేశ్యాదవ్, వార్డు సభ్యులు పవన్కుమార్, మల్లేశ్యాదవ్, మానస, నాయకులు కస్నానాయక్, లింగం, రవి, జమీర్, భిక్షపతి, శ్రీశైలం, రాములు, అమీర్, పాండు, రాజు, మునీర్, నర్సింహ, కృష్ణ, శివలింగం ఉన్నారు.