ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతున్నది. ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారు. ఈసారి మొదటి సంవత్సరం 53 శాతం, ద్వితీయ సంవత్సరం 57శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, సప్లిమెంటరీ పరీక్షల్లో సుమారు 50శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, ఇప్పటి వరకు 2,498 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరారు.
ఇటీవల పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో చేరికల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి చెందిన 3వేల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించాలన్న సదుద్దేశంతో సబ్జెక్టుల వారీగా విద్యాబోధనకు 54 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
పరిగి, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక విద్యారంగాభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మౌలిక వసతులుండటంతో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణతాశాతాన్ని సాధిస్తుండటంతో తల్లిదండ్రు లు తమ పిల్లలను సర్కారు జూనియర్ కాలేజీల్లో చేర్పించేందుకు మొగ్గు చేపుతున్నారు. జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా ఇప్పటివరకు 2,498 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి ఏడాదిలో చేరారు. ఈ చేరికలు మూడు వేల పైచిలుకు ఉండనున్నట్లు ఇంటర్మీడియట్ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రథమ, ద్వితీయ తరగతుల విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందుతున్నది. సబ్జెక్టుల వారీగా పాఠాలను బోధించేందుకు ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఉన్న తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 54 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించనున్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందనున్నది. వార్షిక పరీక్షల్లో మొదటి ఏడాది పరీక్షల్లో 53 శాతం విద్యార్థులు, ద్వితీయ ఏడాదిలో 57శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఇటీవల జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో సుమారు 50 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తీర్ణత సాధించాయి.
అంతేకాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేస్తు న్నారు. ఇప్పటికే మొదటి, ద్వితీయ తరగతులు చదువుతున్న 3 వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అం దించగా.. మిగతా వారికి త్వరలోనే అందనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి ఏడాదిలో ఇప్పటివరకు 2,498 మంది విద్యార్థులు చేరారు. వారిలో 438 మంది వివిధ వొకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ఏడాదిలో 1,086 మంది చేరగా.. వారిలో జనరల్ విద్యార్థులు 673 మంది, వొకేషనల్ 413 మంది ఉన్నారు. మర్పల్లిలోని కళాశాలలో 138 మంది చేరగా అందులో జనరల్ 113 మంది, వొకేషనల్ 25 మంది, నవాబుపేట కళాశాలలో 50 మంది, వికారాబాద్లోని కళాశాలలో 298 మంది, పెద్దేముల్లోని కాలేజీలో 97 మంది, పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 328 మంది, మోమిన్పేట కళాశాలలో 124 మంది, దోమ కళాశాలలో 165 మంది, కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 212 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదల కావడంతో మరికొంత మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరనున్నారు. తద్వారా ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరం చేరికలు 3వేల పైచిలుకు దాటనున్నాయని ఇంటర్మీడియట్ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాదిలో ఇప్పటివరకు 2,498 మంది విద్యార్థులు చేరారు. వారిలో 438 మంది వొకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడి కావడంతో ఈ చేరికలు మూడు వేలను దాటనున్నాయి. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో 54 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
-శంకర్నాయక్, వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి