పరిగి, సెప్టెంబర్ 2: వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. వానకాలం ప్రారంభం నుంచి సమృద్ధిగా వర్షాలు కురువడంతో వాగులు, కాలువలు పొంగిపొర్లి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భనీటి మట్టాలు అమాంతం పెరిగాయి. బోరుబావుల్లోనూ సమృద్ధిగా నీరు ఉండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు, కుంటల్లో పూడికతీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు పెరుగడంలో కీలక భూమిక పోషించాయి. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో జిల్లా సరాసరి నీటి మట్టం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 39 ప్రాంతాల్లో అధికారులు నీటి లెవల్స్ పరిశీలించారు. జూలైలో భూ ఉపరితలం నుంచి 7.49 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఆగస్టులో కేవలం 5.6 మీటర్లలోనే ఉన్నాయి. అంటే ఆగస్టులో 2.33 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. తాండూరు మండలంలోని కోటబాస్పల్లిలో అత్యంత తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో జిల్లా సరాసరి భూగర్భ జలమట్టం 2.33 మీటర్లకు పెరుగడం గమనార్హం. జిల్లాలోని 39 ప్రాంతాల్లో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు నీటి లెవల్స్ను పరిశీలించగా.. జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం జూలై నెలలో 7.49 మీటర్లు ఉండగా ఆగస్టులో 5.16 మీటర్లకు పెరిగినది. దీంతో ఆగస్టులో 2.33 మీటర్ల సరాసరి భూగర్భ జలమట్టం పెరిగింది.
కాగా జిల్లాలోని తాండూరు మండలంలోని కోటబాస్పల్లిలో 0.01 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా మర్పల్లి మండలంలోని నర్సాపూర్లో అత్యధికంగా 11.02 మీటర్లలో భూగర్భ జలా లు ఉండటం గమనార్హం. గత నాలుగు నెలలుగా జిల్లాలో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది. వరుసగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు వరద నీటితో ప్రవహించడం, చెరువులు నీటితో నిండిపోవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ మండలాల్లో ఇలా..
వికారాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో భూగర్భ జలమట్టాన్ని తెలుసు కునేందుకు భూగర్భ జలవనరుల శాఖ అధికారులు 39 ప్రాంతాల్లో నీటి లెవల్స్ను సేకరించారు. తద్వారా ఆగస్టు నెలలో జిల్లాలోని మర్పల్లి మండలంలో సరాసరి భూగర్భ జలమట్టం 9.25 మీటర్లు ఉండి జూలైతో పోల్చగా 5.65 మీటర్లకు పెరిగింది. అదేవిధంగా మోమిన్పేటలో 1.39 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 1.58 మీటర్లకు పెరిగింది. నవాబుపేట మండలంలో 2.56 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 2.89 మీటర్లకు, వికారాబాద్లో 4.98 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 7.4 మీటర్లకు, ధారూరులో 6.02 మీటర్లుండగా జూలై తో పోలిస్తే 4.69 మీటర్లకు, బంట్వారంలో 21.14 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 0.13మీటర్లకు, దోమ మండలంలో 7.37 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 2.11మీటర్లకు, కులకచర్లలో 7.22 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 3.95మీటర్లకు, పరిగిలో 10.7 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 3.5 మీటర్లకు, పూడూరులో 2.8 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 2.63 మీటర్లకు, బొంరాస్పేటలో 6.42 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 0.99మీటర్లకు, పెద్దేముల్లో 5.81 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 1.15మీటర్లకు, తాండూరులో 1.02 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 2.59 మీటర్లకు, బషీరాబాద్లో 7.12 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 0.83 మీటర్లకు, యాలాల్లో 5.31 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 0.73 మీటర్లకు, కొడంగల్లో 5.05 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 2.24మీటర్లకు, దౌల్తాబాద్లో 3.33 మీటర్లుండగా జూలైతో పోలిస్తే 1.27 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లాలో 1179 చెరువులు, కుంటలుండగా 75 శాతానికిపైగా నీటితో నిండి అలుగులు పారాయి.