పెద్దేముల్, సెప్టెంబర్ 2 : సీఎం కేసీఆర్ ఆసరా పథకంతో వితంతువులు, వికలాం గులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పెన్షన్లను అందించి వారిని అన్ని విధాలుగా ఆదుకొంటున్నారని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కందనెల్లి జీపీఆర్ గార్డెన్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ స్మార్ట్కార్డులు, ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలస్యం అయినా అన్ని పథకాలు దశలవారీగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఎంతటీ ఆర్థిక సంక్షోభం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా ప్రతి గింజను కొన్న విషయాన్ని వారు గుర్తుచేశారు.
ప్రక్క రాష్ర్టాల వారు మేం తెలంగాణలో కలిసిపోతాం అనే విధంగా పథకాల అమలు జరుగుతుందన్నారు. .కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం ఉపా ధ్య క్షుడు వెంకటేశ్చారి, ఎంపీపీ అనురాధరమేశ్,జడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఇందూరు ప్రకాశ్, ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మా, ఆర్ఐ రాజురెడ్డి, యువనాయకుడు మహిపాల్ రెడ్డి,రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, డీవై నర్సింహు లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్
కులకచర్ల: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల పరిధిలోని చౌడాపూర్, మరికల్, మక్తవెంకటాపూర్, కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల, ఇప్పాయిపల్లి, కుస్మసముద్రం, పుట్టపహాడ్, అంతారం గ్రామాల్లో నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.
గ్రామాల్లో మూడు విడుతలుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మం జూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, పింఛన్రాని వారు ఎవ్వరు కూడా నిరుత్సాహపడకూడదన్నారు. ఈ సందర్భంగా అర్హులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మం డల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షు డు సత్తినేని సుధాకర్రెడ్డి, ఎంపీడీవో నాగవేణి, కులకచర్ల, చౌడాపూర్ గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..
వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 353 ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పుష్పలతారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, పావని, అనంత్రెడ్డి, రామస్వామి, నాయకులు వేణుగోపాల్, దత్తు పాల్గొన్నారు.
ప్రతి దశలోనూ సంక్షేమం..
ధారూరు: రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యం గా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 1285మందికి మంజూరైన పింఛన్ లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు ప్రొసీడీంగ్ పత్రాలను నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మనిషి పుట్టుక నుంచి మరణించిన తదనంతరం వరకు కూడా ప్రతి దశలో సంక్షేమం అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసి కోస్నం సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, ప్రధా న కార్యదర్శులు రాజుగుప్తా, కావలి అంజయ్య, మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, రైతు బంధు సమితి కమిటీ మం డల అధ్యక్షుడు వెంకటయ్య, ఎంఐఎం మండల అధ్యక్షుడు మోహీజ్ఖురేషి, ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.