కడ్తాల్, ఆగస్టు 17 : క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫ్రీడం కప్ జోనల్ స్థాయి క్రీడా పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. సరూర్నగర్లో నిర్వహించే జిల్లా స్థాయి పోటీల్లో రాణించే విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు. అనంతరం అండర్-14, 17 విభాగాల్లో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్, లాంగ్జంప్ క్రీడల్లో గెలుపొందిన కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి మండలాలకు చెందిన విద్యార్థులకు ఎమ్మెల్సీ బహుమతులను అందజేశారు. అంతకుముందు బుధవారం ఉదయం జోనల్ స్థాయి పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్రెడ్డి, గోపాల్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ పాల్గొన్నారు.
జోనల్స్థాయి క్రీడా పోటీలు ముగింపు
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన విద్యార్థులకు జోనల్స్థాయి క్రీడా పోటీలు రెండురోజులుగా కొనసాగుతున్నాయి. బుధవారం ముగింపు కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వాలీబాల్ మొదటి బహుమతి చర్లపటేల్గూడ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించగా, ద్వితీయ బహుమతి కొంగరకలాన్, కబడ్డీ బొంగుళూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. ఖోఖో యాచారం ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. దేవదాసు, మహ్మద్ సాబేర్, యాదమ్మ, వెంకటేశ్, రాథోడ్ భాస్కర్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
షాద్నగర్టౌన్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన షాద్నగర్ జోనల్స్థాయి క్రీడోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ నవీన్కుమార్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎంపీడీవో వినయ్కుమార్, కొత్తూరు ఎంపీడీవో శరత్బాబు, కౌన్సిలర్లు నర్సింహ, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, సర్వర్పాషా పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో విద్యార్థుల ప్రతిభ
పెద్దఅంబర్పేట : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని తారామతిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. వాలీబాల్లో బాలురు మొదటి బహుమతి, కబడ్డీలో ద్వితీయ బహుమతితో ఆకట్టుకున్నారు. బాలికలు కబడ్డీలో ద్వితీయ బహుమతి సాధించారు. 100 మీటర్ల పరుగు పందెంలో పదో తరగతి విద్యార్థిని అమూల్య మొదటి, శ్రీలత ద్వితీయ బహుమతి, 200 మీటర్ల పరుగు పందెంలో గౌరి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నట్లు హెచ్ఎం ఎన్ రామలింగం తెలిపారు. ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. క్రీడా పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను బుధవారం ఉపాధ్యాయులు అభినందించారు.
పోటీలను ప్రారంభించిన సీఐ
యాచారం : క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని సీఐ లింగయ్య అన్నారు. 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండలంలోని నక్కగుట్టతండా సమీపంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో యాచారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను సీఐ లింగయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ క్రీడా పోటీలు నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు ప్రసాద్, వెంకట్నారాయణ, ప్రిన్సిపాల్ అర్జున, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
శంకర్పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జడ్పీటీసీ గోవిందమ్మ, చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నా రు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవరణలో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు క్రీడా రంగం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ర్టానికి, దేశానికి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, కౌన్సిలర్లు శ్వేత, పాండురంగారెడ్డి, ఎంఈవో అక్బర్ ఉనారు.