ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 13 : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బోయవాడ బస్తీకి చెందిన దుర్గారాధ అనే మహిళకకు తక్షణ వైద్య సాయం కోసం రూ.1.50 లక్షల చెక్కును శనివారం అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్ నీలం శ్వేత, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, నాయకుడు రాజు ఉన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన 31 మంది బాధితులకు రూ.13.72 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి : బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం మండల కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్లు జయమ్మ, హైమవతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదల జీవితాల్లో వెలుగులు
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన యాదయ్యకు రూ.60 వేలు, నితీశ్కు రూ.36 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం హైదరాబాద్లో అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేందర్రెడ్డి, ఉప సర్పంచ్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎం సహాయనిధి
మాడ్గుల : సుద్దపల్లి గ్రామానికి చెందిన మాధవాచారికి రూ. 40 వేలు, శ్రీనివాసచారికి రూ. 30 వేలు, కుల్కులపల్లి గ్రామనికి చెందిన సూర్గి జంగయ్యకు రూ. 60 వేలు, రెడ్డేమోని సత్తయ్యకు రూ. 56 వేలు, షాకీర్కు రూ. 35 వేలు, మంజులకు రూ. 20 వేలు, అంజయ్యకు రూ. 34 వేలు, పల్లె యాదమ్మకు రూ. 16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గ్యార వెంకటయ్య పాల్గొన్నారు.