షాద్నగర్, ఆగస్టు 13: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ అధ్యక్షతన శనివారం షాద్నగర్ పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్హాల్లో మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు పార్టీకి సేవలందిస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించడమే కాకుండా అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఎలా పయనిస్తుందో మనందరికి తెలుసని, సీఎం నాయకత్వానికి మనమందరం మద్దతు తెలుపాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలని కార్యకర్తలను కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ బక్కనయాదవ్, నాయకులు నారాయణయాదవ్, వెంకటేశ్గౌడ్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.17.42లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
షాద్నగర్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ రూ. 17.42లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశా రు. 42 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశామని, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అభివృద్ధి పనుల్లో రాజకీ యాలకతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.